జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఇప్పటం గ్రామానికి రాబోతున్నారు. రీసెంట్ గా వైస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలోని కొంతమంది ఇళ్లను కూల్చేసిన సంగతి తెలిసిందే. జనసేన మీటింగ్ కు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కోపంతోనే వారి ఇళ్లను కూల్చేశారని జనసేన ఆరోపిస్తూ..ఇల్లు కోల్పోయిన వారికీ లక్ష రూపాయిలు ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారం వారికీ నష్టపరిహారం ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటం కు వెళ్ళబోతున్నారు.