పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న చిత్రం ‘హరిహర వీర మల్లు’. కొన్ని రోజుల క్రితం క్రిష్ టీంతో కలిసి వర్క్ షాప్లో కూడా పాల్గొన్నారు. కాగా పవన్ కళ్యాణ్ తాజాగా షూటింగ్లో జాయిన్ అయ్యారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ యాక్షన్ మూడ్లో చూడటం సంతోషంగా ఉంది.. కెప్టెన్, డైరెక్టర్ క్రిష్ జాబ్లో ఉన్నారు.. అంటూ లొకేషన్లో డైరెక్టర్ క్రిష్ స్టిల్ను షేర్ చేశాడు హరీష్ శంకర్. రామోజీ ఫిలింసిటీలో ప్రస్తుతం హై ఆక్టేన్ యాక్షన్ సీన్లు షూట్ చేస్తున్నారు. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో సాగే ఈ సీక్వెన్స్ సినిమాకే హైలెట్గా నిలువబోతుంది.