భాగ్యనగరం ఐటి ఉద్యోగుల కోసం మరో రవాణా వ్యవస్థ రానుందన్న వార్తలు వస్తున్నాయి. యుకె నగరం లండన్లో ఉన్నట్లే హైదరాబాద్లోనూ పీఆర్టిఎస్ (పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)ను తీసుకురానున్నట్లు ఐటి మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. కేటాయించిన ట్రాక్పై 4–6 గురు ప్రయాణించే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ పాడ్స్ను ఐటి కారిడార్లో ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణానికి రూ.2500 ల కోట్ల ఖర్చు కానుందని డిపిఆర్ సైతం సిద్ధమైంది.