ఆర్ధిక కష్టాల్లో ఉన్న శ్రీలంక అక్కడి ప్రజలకు కనీస అవసరాలు సైతం దక్కకుండా చేస్తోంది. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచేసింది. పెట్రోల్పై 24.3 శాతం ధరను పెంచిన ఆ దేశం డీజిల్పై38.4 శాతం పెంచింది. దీంతో ఒక లీటరు పెట్రోల్ ఆ దేశంలో రూ.420కు, డీజిల్ రూ.400లకు చేరింది. అదే సమయంలో శ్రీలంకలో ద్రవ్యోల్బణం 40 శాతానికి చేరుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నందున ప్రజలు బయటకు రావొద్దని, వర్క్ ఫ్రమ్ హోం కిందే పనిచేయాలని సూచించింది.