కేంద్ర ప్రభుత్వం నిన్న చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన వెంటనే ఎపి ప్రభుత్వం సైతం ఆ వెసులుబాటును ప్రజలకు కల్పించింది. దీంతో ఎపిలో లీటరు పెట్రోల్పై రూ.9.50, డీజిల్పై రూ.7.30 చొప్పున ధర తగ్గింది. దీంతో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం విజయవాడలో లీటరు పెట్రోల్ రూ.111.33 గా ఉండగా డీజిల్ రూ.99.12గా ఉంది. శనివారం వీటి ధరలు వరుసగారూ.120.86, రూ.106.50గానూ ఉండేవి.