ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 11వ విడత నిధులను కేంద్రం మంగళవారం విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది రైతులకు మే 31న వారి ఖాతాల్లో రూ.2 వేల చొప్పున డబ్బును జమ చేయనుంది. నాలుగు నెలలకోసారి ఈ డబ్బుల్ని కేంద్రం రైతుల ఖాతాల్లో నేరుగా జామచేస్తోంది. ఏడాదికి రూ.6 వేల చొప్పున 4 నెలలకోసారి రూ.2 వేలను వారి ఖాతాల్లో కేంద్రం జమ చేస్తోంది.