నాలుగు రోజుల యూరప్ పర్యటనకు వెళ్ళిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఈరోజు జర్మనీలోని బెర్లిన్లో ఘన స్వాగతం లభించింది. అక్కడి ప్రవాస భారతీయులు మోదీకి పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. జర్మనీ ఛాన్స్లర్గా ఓలాస్ స్కాల్జ్ ఎన్నికైన తర్వాత మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. యూరప్లో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో మోదీ జరుపుతున్న ఈ పర్యటనపై ప్రపంచ దేశాలతో పాటు రష్యా, ఉక్రెయిన్లు సైతం ఓ కన్నేసి ఉంచాయి.