సంక్షేమ పథకాలన్నీ పేదల వరకూ చేరేలా చూడడమే తన లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్లో జరిగిన ఓ సదస్సులో వర్చువల్గా మాట్లాడిన ఆయన ‘నన్ను ఎప్పుడూ విమర్శిస్తుండే ప్రతిపక్ష నాయకుడు ఈ మధ్య నన్ను కలిశారు. ఈ దేశం నిన్ను రెండుసార్లు ప్రధానిని చేసింది. నీకు ఇంతకంటే ఏం కావాలి? అని ప్రశ్నించారు’ అని మోదీ బయటపెట్టారు. ఎన్సిపి అధినేత శరద్పవార్ గురించే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకటికి రెండుసార్లు పిఎం అయితే అన్నీ సాధించినట్లేనా? అని మోదీ అన్నారు.