ఫోన్లో మాట్లాడుకున్న పుతిన్​–మోదీ

By udayam on December 16th / 1:07 pm IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ లు ఈరోజు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్​ యుద్ధంతో పాటు డిఫెన్స్​, రక్షణ రంగాల్లో సహకారం పైనా వీరిద్దరి మధ్య ఫోన్​ సంభాషణ జరిగిందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఉక్రెయిన్​ యుద్ధాన్ని చర్చలతో ముగించాలంటూ ప్రధాని మరోసారి పుతిన్​ కు సూచించారు. ఎనర్జీ కో ఆపరేషన్​, వర్తకం, పెట్టుబడులు, రక్షణ రంగాలపైనా చర్చలు జరిగాయి.

ట్యాగ్స్​