జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. పరాయి దేశ గడ్డపైనా కాంగ్రెస్ను ఉతికారేశారు. జర్మనీలోని భారతీయులను ఉద్దేశించి బహిరంగ సభలో దాదాపు గంటసేపు మాట్లాడిన ఆయన ‘ఇకపై ఏ ప్రధాని కూడా తాను ఖర్చు చేస్తున్న రూపాయిలో 85 పైసలు ప్రజలకు చేరట్లేదు అనే మాటలు చెప్పరు’ అని పరోక్షంగా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. దాదాపు 1600లకు పైగా భారతీయులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ‘2024లో తిరిగి మోదీ రావాలి’ అంటూ వారంతా నినాదాలు చేశారు.