జనవరి 19 న సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోడీ ప్రారభించబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. ముందుగా ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విజయవాద మధ్య నడవనుంది. ఆ తరువాత ఇదే రైలును విశాఖ వరకు పొడించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నాలుగు గంటల్లోనే చేరుకొనే అవకాశం కలుగుతుంది.