ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ కి కర్ణాటకలోని మైసూర్ నగరంలో ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టడంతో కారులో ఉన్న వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో కారులో 69 ఏళ్ళ ప్రహ్లాద్ తో పాటు ఆయన కొడుకు, కోడలు, మనువడు కూడా ఉన్నారు. రోడ్డు డివైడర్ ను కారు ఢీకొట్టడంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులను మైసూరులోని జేఎస్ హాస్పిటల్ కు తరలించారు.