తెలంగాణను నాశనం చేసే వారు గతంలో ఉన్నట్లే.. ఇప్పుడూ ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ.. సిఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఈరోజు హైదరాబాద్ వచ్చిన మోదీ ఇక్కడి బిజెపి శ్రేణులతో మాట్లాడారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలతో ఒక్క కుటుంబమే బాగుపడుతోందన్న ఆయన ఇక్కడ వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు. సర్దార్ పటేల్ స్ఫూర్తితో బిజెపి శ్రేణులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.