ప్రపంచ స్థాయి నాయకత్వ ర్యాంకింగ్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తిరిగి అగ్రస్థానం దక్కింది. మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ నిర్వహించిన ఈ సర్వేలో మోదీకి గతం కంటే ఎక్కువగా 77 శాతం ఓటింగ్ జరిగింది. మోదీ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ 56 శాతం ఓటింగ్ తో రెండో స్థానంలోనూ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ 41 వ శాతంతో మూడో స్థానంలోనూ ఉన్నారు. కెనడా ప్రధాని ట్రుడోకి 38 శాతం ఓట్లు వస్తే, బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ కు 36 శాతం, జపాన్ ప్రధానికి 23 శాతం ఓట్లు పడ్డాయి.