సెల్ఫోన్ వాడినందుకు హాస్టల్ యాజమాన్యం కోప్పడిందన్న చిన్న కారణంతో తిరుపతిలోని సంప్రదాయ పాఠశాల నుంచి పారిపోయిన 4 గురు అమ్మాయిల జాడను పోలీసులు గుర్తించారు. వర్షిణి, ప్రణతి, స్రవంతి, శ్రీవల్లిలు ట్రైన్లో కొల్లాపూర్కు అటు నుంచి ముంబైకి పారిపోయారు. అక్కడ నేవీ ఆఫీసర్ వీరిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుపతి పోలీసులు స్వయంగా వెళ్ళి వీరిని తీసుకొచ్చారు. హాల్ టిక్కెట్లు లేకపోతే తల్లిదండ్రులు మందలిస్తారనే వీరు ఈ పనిచేశారని పోలీసులు తెలిపారు.