బాపట్ల: సముద్రంలో మునిగిన ఇద్దరు మహిళలు.. సిపిఆర్​ తో ప్రాణాలు నిలబెట్టిన పోలీసు

By udayam on November 23rd / 5:12 am IST

బాపట్ల బీచ్ లో కార్తీకమాసం సందర్భంగా సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చి, సముద్రపు నీటిలో మునిగిపోయి గల్లంతవుతున్న ఇద్దరు యువతలను పోలీసులు కాపాడారు. ఒడ్డుకు తీసుకొచ్చిన వారిద్దరికీ సిపిఆర్​ చేసిన బీట్​ కానిస్టేబుల్స్​ వారికి పునర్జన్మను ప్రసాదించారు. స్థానికులు సైతం సిపిఆర్​ చేయడంలో పోలీసులకు సాయం చేశారు. దీంతో వీరిద్దరూ కాసేపటికి స్పృహ లోకి వచ్చారు. వెంటనే వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్​