మణిరత్నం మాగ్నం ఓపస్ పొన్నియన్ సెల్వన్ ధియేటర్ల వద్ద కలెక్షన్లను ఇప్పటికీ రాబడుతోంది. విడుదలై 75 రోజులు గడిచిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ బుక్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ చోళ రాజుల పాత్రలో విక్రమ్, జయం రవి, ప్రకాష్ రాజులు నటిస్తే, సహాయక పాత్రల్లో కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్, శోభిత దూళిపాళ్ళలు నటించారు.
రూ.500 కోట్ల క్లబ్ లోకి పొన్నియన్ సెల్వన్#PonniyinSelvan pic.twitter.com/BuCTgKA6lX
— Udayam News Telugu (@udayam_official) November 18, 2022