పొన్నియన్ సెల్వన్ పార్ట్–1 టివి ప్రసారానికి సిద్ధమైంది. గతేడాది సెప్టెంబర్ 30న విడుదలైన రూ.600 కోట్లు కొల్లగొట్టిన ఈ పాన్ ఇండియా మూవీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలలోనూ దుమ్ము రేపుతోంది. తాజాగా ఈ మూవీని బుల్లితెర పై ప్రసారం చేయాలని మేకర్స్ నిర్ణయించారు. జనవరి 8 సాయంత్రం 6 గంటల నుంచి ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. మణిరత్నం డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్, విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి ప్రధానపాత్రల్లో నటించారు.