తన ప్రేయసి శ్రద్ధా వాకర్ ను 35 ముక్కలుగా నరికి ఢిల్లీ శివార్లలో పారేసిన కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఢిల్లీ సాకేత్ కోర్ట్ లో అఫ్తాబ్ తరపున లాయర్ ఈ పిటిషన్ వేశాడు. అతడికి జైలులో రక్షణ లేదన్న న్యాయవాది.. అఫ్తాబ్ కు బెయిల్ మంజూరు చేయాలని వాదించారు. ఈ పిటిషన్ పై కోర్టు రేపు తీర్పును వెల్లడించనుంది.