ఐపిఎల్ మ్యాచ్ల్లో బెట్టింగ్ కాసే అలవాటున్న మధ్యప్రదేశ్కు చెందిన ఓ పోస్ట్మ్యాన్.. అతడు పనిచేసే శాఖలోని 24 మంది ఖాతాదారుల డిపాజిట్లను కాజేసి వాటిని బెట్టింగుల్లో కోల్పోయాడు. సబ్ పోస్ట్ ఆఫీస్లో పనిచేసే విశాల్ అహిర్వార్ అనే పోస్ట్మాన్పై ప్రస్తుతం కేసు నమోదైంది. ఇలా అతడు 24 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ.1 కోటికి పైగా డబ్బును కాజేశాడని పోలీసులు తెలిపారు. ఇలా అతడు గత 2 ఏళ్ళుగా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.