దేశ రాజధానిలో జరిగిన అత్యంత దారుణ యాక్సిడెంట్ లో మరణించిన మహిళపై ఎలాంటి అత్యాచారం జరగలేదని పోస్ట్ మార్టం రిపోర్ట్ వెల్లడించింది. సుల్తాన్ పురి ప్రాంతంలో 20 ఏళ్ళ మహిళను కొందరు వ్యక్తులు కారుతో గుద్దేసి 13 కి.మీ.లు ఈడ్చుకుపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మందుకొట్టి, మ్యూజిక్ ను పెద్ద శబ్దంతో వింటుండంతో వారి కారుకు అమ్మాయి తగులుకుందన్న విషయాన్ని కూడా వారు పట్టించుకోలేదు. ఈ ఘటనలపై పలు అనుమానాలు రేకెత్తగా ఆమెకు జరిపిన పోస్ట్ మార్టంలో అమ్మాయిపై అఘాయిత్యం జరగలేదని తేల్చింది.