భారత యువ గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రజ్ఞానంద మెల్ట్ వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్లో చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ ఫైనల్స్లోకి అడుగు పెట్టిన అతడు ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్గా నిలిచాడు. బుధవారం జరిగిన సెమీస్లో డచ్ గ్రాండ్ మాస్టర్ అనిష్ గిరిని 3.5 – 2.5 తేడాతో ఓడించి ఫైనల్స్లోకి అడుగు పెట్టాడు. నాలుగు గేమ్ల ఈ టోర్నీలో 2–2 తో నిలిచిన ప్రజ్ఞానంద చివరి మ్యాచ్లో విజృంభించి ఆడాడు.