ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బిజెపికి వచ్చిన ఓట్ల శాతాన్ని చూసి ఓర్వలేకే టిఆర్ఎస్ నాయకులు తమ నేతల ఇళ్ళపై దాడికి దిగుతున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ ఇంటిపై దాడి ఘటనను ఖొండించిన ఆయన.. టిఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవితల్లో ఎవరు తమ పార్టీలోకి వచ్చినా వెల్కమ్ చెబుతామని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఈ సిఎం.. ప్రధాని వస్తే ముఖం చూపించలేని పిరికివాడన్నారు.