ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జన్ సూరజ్ పేరుతో ఈరోజు పార్టీని ప్రకటిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయనే స్వయంగా ఖండించారు. పార్టీ ప్రకటన ఏదీ ఈరోజు చేయబోవట్లేదని తెలిపారు. అదే సమయంలో బీహార్లోని వెస్ట్ చంపారన్ గాంధీ ఆశ్రమం నుంచి అక్టోబర్ 2న 3 వేల కి.మీ.ల పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటినీ, ఆఫీసుకూ వెళ్ళి వారిని కలిసి వారితో మాట్లాడతానని చెప్పుకొచ్చారు.