తిరుమల వేంకటేశ్వరస్వామిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా భూ వరాహస్వామిని దర్శించుకున్న ఆమె ఆ తర్వాత తిరుమల ఆలయానికి చేరుకున్నారు. ఆమెకు అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి రాష్ట్రపతి నమస్కరించిన అనంతరం వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ముర్ముతోపాటు పెద్దజీయంగార్ స్వామి, చిన్నజీయంగార్ స్వామి, టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డిలు ఉన్నారు.
#JUSTIN: @rashtrapatibhvn #DraupadiMurmu visited #Tirumala temple, during her visit to #AndhraPradesh. @NewsMeter_In pic.twitter.com/9hVSflDkZA
— SriLakshmi Muttevi (@SriLakshmi_10) December 5, 2022