రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొద్ది సేపటి క్రితం భద్రాచలం చేరుకున్నారు. ఆమెకు పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. భద్రాద్రి రాముని ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ద్రౌపదీ ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.