200 ఏళ్ళ క్రితమే అంతరించిపోయిందనుకున్న ఓ మొక్కజాతి హిమాచల్ ప్రదేశ్లో తిరిగి కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. బ్రకిస్టెల్మా అటెన్యూటమ్గా పిలిచే ఈ మొక్కను చివరిసారిగా 1835లో బ్రిటీష్ బొటానిస్ట్లు జాన్ ఫోర్బ్స్ రోయల్, రాబర్ట్ వెయిట్లు హిమాచల్ ప్రదేశ్లోని డూంగీ గ్రామంలో గుర్తించారని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ తర్వాత మరోసారి ఈ మొక్క జాతి కనిపించడం ఇదే తొలిసారని వారు చెబుతున్నారు.