మూడేళ్ళ వరకూ ప్రైవేట్ స్కూల్స్ తమ యూనిఫారమ్లు మార్చకూడదని ఢిల్లీ ప్రభుత్వం అక్కడి స్కూల్ యాజమాన్యాలను హెచ్చరించింది. అదే సమయంలో తల్లిదండ్రులతో బలవంతంగా ఖరీదైన పుస్తకాలను, మెటీరియల్స్ను కానీ కొనిపించడం చేస్తే ఆ స్కూల్స్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తామని పేర్కొంది. ట్రస్ట్లు, సొసైటీల పేరుతో నడుస్తున్న స్కూల్స్ లాభాపేక్షే పరమావధిగా ఉండడం సరికాదని పేర్కొంది. ప్రతీ క్లాస్లోనూ విద్యార్థుల హాజరును డిస్ ప్లే బోర్డుల్లో చూపించాలని సైతం పేర్కొంది.