ఈ ఆదివారం జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచిన జట్టుకు ఏకంగా రూ.340 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే ఫైనల్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.250 కోట్లు దక్కనున్నాయి. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.223 కోట్లు, 4వ స్థానంలో ఉన్న జట్టుకు రూ.200 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. క్వార్టర్స్ చేరిన బ్రెజిల్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఇంగ్లాండ్ జట్లకు రూ.140 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ అందనుంది. గ్రూప్ 16 చేరిన జట్లకు రూ.107 కోట్లు, పార్టిసిపేషన్ జట్లకు రూ.75 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది.