బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ తొలి రోజు ఆటను 278/6 వద్ద ముగించింది. ఓ దశలో 48 కే గిల్(20), రాహుల్ (22), కోహ్లీ (1) వికెట్లు కోల్పోయిన జట్టును పంత్ (46) తన ఫాస్ట్ బ్యాటింగ్ తో ఆదుకుని అర్ధ సెంచరీకి 4 పరుగుల దూరంలో స్టంపౌంట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (82*) తో కలిసి పుజారా (90) ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో సెంచరీకి 10 పరుగుల దూరంలో పుజారా తైజుల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా 14 పరుగులకు ఔట్ అయ్యాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ 3, మెహదీ హసన్ 2, ఖలీద్ ఒక వికెట్ తీశారు.
Stumps on Day 1⃣ of the first #BANvIND Test!@ShreyasIyer15 remains unbeaten on 8⃣2⃣* as #TeamIndia reach 278/6 at the end of day's play 👌
Scorecard ▶️ https://t.co/CVZ44N7IRe pic.twitter.com/muGIlGUbNE
— BCCI (@BCCI) December 14, 2022