ఎప్పుడు ఎలా ఆడతాయో తెలియని పంజాబ్, బెంగళూరు జట్ల మధ్య నిన్నటి మ్యాచ్లో మయాంక్ సేన అదరగొట్టేసింది. జానీ బెయిర్స్టో వీర విహారం (66) చేయడంతో పాటు లివింగ్స్టోన్ (70) విధ్వంసకర బ్యాటింగ్ తోడై 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరును రబాడ దెబ్బకొట్టాడు. మ్యాక్స్వెల్ 35 తప్పితే ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. రబాడ 3, రిషి ధావన్, చాహర్ రెండేసి వికెట్లు తీశారు. బెయిర్ స్టోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.