ప్రముఖ పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసావాలా హత్యానంతరం పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రద్దు చేసిన 424 మంది విఐపిల భద్రతను తిరిగి పునరుద్ధరించింది. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్తో సమావేశం అనంతరం ఈ మేరకు పంజాబ్ సిఎం భగవంత్ మాన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని పంజాబ్ ప్రభుత్వం.. పంజాబ్, హర్యాణా హైకోర్ట్కు సైతం వెల్లడించింది.