సూపర్ ఫామ్లో ఉన్న గుజరాత్ టైటాన్స్కు.. పంజాబ్ కింగ్స్ షాకిచ్చింది. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పాండ్య సేనను చిత్తు చేసిన మయాంక్ సేన.. ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ రబాడా (4 w) దెబ్బకు కుదేలైంది. సుదర్శన్ ఒక్కడే 65 పరుగులతో రాణించడంతో 143 పరుగులు చేయగలిగింది. స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ 2 వికెట్లు కోల్పోయి మరో 4 ఓవర్లు మిగిలి ఉండగా ఛేధించింది. ధావన్ 62, రాజపక్స 40, లివింగ్స్టోన్ 30 పరుగులు చేశారు.