పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలాను పంజాబ్లోని మాన్సా జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం విఐపిలకు పోలీసు రక్షణను తొలగించిన 24 గంటల్లోనే ఈ హత్య జరిగింది. 2018లో తుపాకీ సంస్కృతికి సంబంధించిన పాటలతో సిద్ధూ మూసేవాలా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపరాని ప్రత్యక్ష సాక్షుల కథనం.