వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సిఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేసిన సమయంలో ఆ శాఖ ఏడీజీ సునీల్ కుమార్ కొట్టారని, కస్టోడియల్ టార్చర్ చేశారని లేఖలో పేర్కొన్న ఆయన.. ఈ తతంగం మొత్తాన్ని సిఎం జగన్ వీడియో ద్వారా లైవ్ లో చూశారంటూ రాసుకొచ్చారు. విచారణ అధికారులను పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఇంకా పిలవలేదని, ఎవరు కొట్టారో ఇంకా విచారణే జరపలేదని అన్నారు. ఈ అంశంపై త్వరగా విచారణ జరిపించాలని కోరారు.