హిమాచల్ ప్రదేశ్లో ఈనెల 12–15 తేదీల్లో జరగనున్న బిజెపి యువమోర్చా సదస్సుకు తాను వెళ్తున్నానంటూ జాతీయ మీడియాలో వచ్చిన వార్తలపై భారత క్రికెట్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశాడు. తాను ఎలాంటి రాజకీయ సమావేశాలకు హాజరుకావడం లేదని స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని బిసిసిఐ సైతం నిర్ధారించింది. అంతకు ముందు ధర్మశాల ఎమ్మెల్యే విశాల్ నెహ్రియా ఈ సమావేశానికి ద్రవిడ్ వస్తున్నాడని ప్రకటించడంతో ఆ వార్త వైరల్ అయింది.