భారత సీనియర్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా సదస్సుకు హాజరు కానున్నాడు. ఈనెల 12 నుంచి 15 వరకూ హిమాచల్ ప్రదేశ్లో జరిగే ఈ సమావేశానికి ద్రవిడ్ రానున్నట్లు ధర్మశాల ఎమ్మెల్యే విశాల్ నెహ్రియా వెల్లడించాడు. ఇదే సమావేశానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు సైతం రానున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే ద్రవిడ్ బిజెపి మీటింగ్కు వస్తున్నాడన్న వార్త ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.