కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ యుకె పర్యటన వివాదాస్పదమవుతోంది. ఆయన భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే యుకె పర్యటనకు వెళ్ళినట్లు కేంద్రం చెబుతోంది. ప్రతీ పార్లమెంట్ సభ్యుడు విదేశాలకు వెళ్ళే ముందు ‘పొలిటికల్ క్లియరెన్స్’ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. ప్రైవేటు కార్యక్రమాలకు ఆ అవసరం లేదని ప్రకటించింది. టివి ఛానళ్ళు కూడా ప్రభుత్వం పంపే వాట్సాప్ మెసేజ్లను నమ్మక్కర్లేదు అని పేర్కొంది.