తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాకుండా ఓ రాజు పాలిస్తున్న అనుభూతిని ప్రజలు చూస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. వచ్చే ఏడాది ఇక్కడ జరగనున్న ఎన్నికల్లో తాము టిఆర్ఎస్తో పొత్తుకు వెళ్ళేది లేదన్న ఆయన.. టిఆర్ఎస్తో అమీ తుమీ తేల్చుకోనున్నామన్నారు. వేల కోట్ల అవినీతి చేసిన నాయకుడు రాష్ట్రానికి సిఎంగా ఉండే అర్హత లేదన్న రాహుల్.. ఎందుకని టిఆర్ఎస్ నేతలపై ఈడీ, సిబిఐ దాడులు జరిపించరో బిజెపి చెప్పాలని ప్రశ్నించారు.