అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందని వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
Remember his promise- “मैं देश झुकने नहीं दूँगा।” pic.twitter.com/NdXT4hqkNK
— Rahul Gandhi (@RahulGandhi) January 19, 2021
ఈ దేశాన్ని ఎవరి ముందూ మోకరిల్లనివ్వం అంటూ మీరు చేసిన వాగ్ధానం గుర్తుందా అంటూ ఆయన ట్విట్టర్లో మోదీని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ లీడర్ రణదీప్ సుర్జేవాలా సైతం ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు.
‘‘మోదీ జీ మీ 56 ఇంచుల చెస్ట్ ఎక్కడుంది” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
मोदी जी, वो “56 इंच” का सीना कहाँ है ? pic.twitter.com/FuLv3onexi
— Randeep Singh Surjewala (@rssurjewala) January 19, 2021
మరో కాంగ్రెస్ లీడర్ పి చిదంబరం సైతం ఈ విషయంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. మీ సొంత పార్టీ ఎంపి తాపిర్ గావో సైతం చైనా అరుణాచల్ వద్ద 100 ఇళ్ళతో ఓ గ్రామాన్ని నిర్మించిందని పేర్కొన్నారని దీనిపై ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ ప్రశ్నించారు.