సీఆర్పీఎఫ్​: 113 సార్లు రాహుల్​ మా మాట లెక్కచేయలేదు

By udayam on December 29th / 11:37 am IST

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సీఆర్ పీఎఫ్ గురువారం స్పందించింది. సెక్యూరిటీ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంలేదని, రాహుల్ గాంధీ భద్రతా మార్గదర్శకాలను తరచూ ఉల్లంఘిస్తారని పేర్కొంది. 2020 నుంచి ఇప్పటి వరకు 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను రాహుల్ అతిక్రమించారని, ఈ విషయాన్ని ఆయనకు కూడా తెలియజేసినట్లు వివరించింది.

ట్యాగ్స్​