అసాని తుపాను దిశను మార్చుకుని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద తీరం దాటనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కాకినాడ జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నాటికి ఈ తుపాను కాకినాడ తీరం దాటుతుందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ప్రదీప్ కుమార్ జేనా సైతం ప్రకటించారు. ఉత్తర బెంగాల్ నుంచి ఉత్తర ఆంధ్ర వైపు ఈ తుపాను గమనాన్ని మార్చుకుందని ఆయన ఎఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.