మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న కొత్త చిత్రం SSMB 29 ఒక పార్ట్ తో ఆగదని రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ మూవీని పలు పార్ట్స్ గా ఫ్రాంఛైజీ రూపంలో తెరకెక్కిస్తారని చెప్పి మహేష్ ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాట్టింగ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీకి రాజమౌళి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమవ్వగా మహేష్ కమిట్మెంట్స్ పూర్తవ్వగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.