ఐపిఎల్ ప్లే ఆఫ్స్ రేసులోకి రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంతో దూసుకుపోయింది. నిన్న రాత్రి చెన్నైతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో 2 బాల్స్ మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేధించిన సంజూ సేన 2008 తర్వాత తొలిసారిగా గ్రూప్ స్టేజ్లో టాప్ పొజిషన్ దక్కించుకుంది. అంతకు ముందు మోయిన్ ఆలీ 93, ధోనీ 26 పరుగులతో రాణించడంతో చెన్నై 150 పరుగుల మోస్తరు స్కోరు చేసింది. ఆపై రాయల్స్ జట్టులో జైశ్వాల్ 59, అశ్విన్ 40 పరుగులు చేసి రాజస్థాన్కు విజయాన్ని కట్టబెట్టారు.