ఆస్తి కోసం భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న స్వామి శ్రద్దానంద్ అనే వ్యక్తి తననూ రాజీవ్ గాంధీ హంతకులను జైలు నుంచి విడిచిపెట్టినట్లే వదిలేయాలని సుప్రీం మెట్లెక్కాడు. ‘43 మందిని హత్య చేసిన నిందితులకు.. మధ్యలో పెరోల్ దొరికింది. 30 ఏళ్ళలో ఎన్నోసార్లు వారు జైలు నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు విడుదలయ్యారు. కానీ నేను మాత్రం గత 29 ఏళ్ళుగా జైలులోనే ఒక్కరోజూ పెరోల్ లేకుండా గడిపాను. వారికి వర్తించిన చట్టాలు నాకెందుకు వర్తించవు. నన్నూ వదిలేయండి’ అంటూ చీఫ్ జస్టిస్ డివై.చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ జె.బి.పర్దీవాలా ధర్మాసనం ముందు వాదించుకున్నాడు. అయితే దీనిపై సుప్రీం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.