ఈనెల 20 నుంచి జీ5 ఓటిటి వేదికగా స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి కొత్త ట్రైలర్ విడుదలైంది. ఒరిజినటల్ ట్రైలర్కు పలు మార్పులు చేస్తూ ఈ కొత్త ట్రైలర్ను కట్ చేసింది. మూవీలో రామ్చరణ్, ఎన్టీఆర్ల కలయిక, ఆపై గొడవలు, మళ్ళీ వీరిద్దరూ కలిసి బ్రిటిష్ వారిపై పోరాడే ఘట్టాలను ఈ ట్రైలర్లో చూపించారు. మార్చి 25న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్ళు దక్కించుకుంది.