పొద్దున్న లేచి బిసిసిఐ పై నోరు పారేసుకునే పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రాజా తన పదవిని కోల్పోయాడు. సొంత దేశం క్రికెట్ పెర్ఫార్మెన్స్ ను గాలికొదిలేసి.. భారత్ పై ప్రగల్భాలు పలికే ఇతడిని.. ఆ దేశ ప్రధాని తప్పించారు. ఇటీవల పాక్ జట్టు ఏ ఒక్క అంతర్జాతీయ టోర్నీని నెగ్గకపోయినా క్షమించిన ఆ దేశ ప్రజలు.. ఇటీవల ఇంగ్లాండ్ చేతిలో స్వదేశంలో టెస్ట్ వైట్ వాష్ కు గురవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిని గమనించిన పాక్ ప్రధాని రమీజ్ రాజాను బోర్డ్ ఛైర్మన్ పదవి నుంచి దించేశాడు. ఆ పదవిని పాత ఛైర్మన్ నజమ్ సేథికి అప్పగించి.. బోర్డ్ లో షాహీద్ అఫ్రిదికి చోటు కల్పించారు.