శ్రీలంకకు కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. యునైటెడ్ నేషనల్ పార్టీ నేత అయిన ఆయనతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రమాణం చేయించారు. మరో వారం రోజుల్లో కొత్త కేబినెట్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విక్రమ సింఘే గతంలోనూ 4 సార్లు ఈ ద్వీప దేశానికి ప్రధానిగా పనిచేశారు. దేశాన్ని ఆర్ధిక కష్టాల నుంచి తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అధ్యక్షుడు.. ప్రధాని పదవి కోసం విక్రమ సింఘేను ఎన్నుకున్నారు.