రేపటి నుంచి న్యూజిలాండ్ తో జరగనున్న టి20, వన్డే సిరీస్ ల కోసం హెడ్ కోచ్ ద్రవిడ్ కు విశ్రాంతిని ఇవ్వడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ద్రవిడ్ జట్టుతోనే ఉండాలన్న అతడు.. ఐపిఎల్ జరిగే రెండు నెలలూ విశ్రాంతిలో ఉంటాడు కదా? అంటూ ప్రశ్నిస్తున్నాడు. “సహాయక సిబ్బందికి విశ్రాంతి ఇవ్వడం వల్ల ఎలాంటి మెరుగైన ఫలితాలు వస్తాయో నాకర్థంకావడంలేదు. ఐపీఎల్ జరిగిన రెండు నెలల పాటు టీమిండియా కోచింగ్ స్టాఫ్ కు విశ్రాంతే కదా. ఆ విరామం చాలదా…? నేను గనుక కోచ్ స్థానంలో ఉంటే అన్ని వేళలా జట్టుతో పాటే ఉండి ఆటగాళ్లను నిశితంగా పరిశీలిస్తుంటాను” అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.