మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్యలో ఎసిపి విక్రమ్ సాగర్ పాత్రలో నటిస్తున రవితేజ కు భారీ పారితోషికం అందినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రవితేజది 45 నిమిషాల పాత్ర అని తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.17 కోట్ల పారితోషికాన్ని రవితేజ అందుకున్నాడని సమాచారం. శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా, బాబీ సింహా కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది.